YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఢిల్లీ ఎలక్షన్స్ ప్రచారం నుంచి అనురాగ్ ఠాకూర్ ఔట్

ఢిల్లీ ఎలక్షన్స్ ప్రచారం నుంచి అనురాగ్ ఠాకూర్ ఔట్

ఢిల్లీ ఎలక్షన్స్ ప్రచారం నుంచి అనురాగ్ ఠాకూర్ ఔట్
న్యూఢిల్లీ, 
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మలను తొలగించాలని ఎన్నికల కమిషన్ బుధవారం నాడు ఆదేశాలు జారీచేసింది. ఈ ఇద్దరు నేతలూ ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, తాము తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ ఇవి కొనసాగుతాయని స్పష్టం చేసింది. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగునున్న విషయం తెలిసిందే.రెండు రోజుల కిందట ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. సీఏఏకి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలపై తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాదు, వీరిని దేశద్రోహులతో పోల్చిన కేంద్ర మంత్రి.. ఆ ద్రోహులందరినీ కాల్చిచంపాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక, పశ్చిమ్ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మ కూడా మంగళవారం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. షహీన్ బాగ్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కశ్మీర్‌లో జరుగుతోన్న పరిణామాలతో ఢిల్లీలోని కశ్మీరీ పండిట్లు సంతోషంగా ఉన్నారు. అయితే, సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్నవారు ఇళ్లలోకి దూరి మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడతున్నారని విమర్శించారు.ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో తీవ్రంగా స్పందించింది. పర్వేశ్ వర్మకు షోకాజ్ నోటీసు జారీచేసిన ఎన్నికల సంఘం.. గురువారం మధ్యాహ్నంలోగా దీనిపై స్పందించి వివరణ ఇవ్వాలని కోరింది. తమ నోటీసుకు స్పందించకుంటే తదుపరి నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది.

Related Posts