YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 సీబీఐ కి అప్పగించేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటి?

 సీబీఐ కి అప్పగించేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటి?

 సీబీఐ కి అప్పగించేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటి?
       వైఎస్ వివేకా హత్యపై ప్రశ్నించిన న్యాయస్థానం
విజయవాడ జనవరి 30
సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో వివేకా హత్య జరిగింది. తాజాగా ప్రభుత్వం మారి వైఎస్ జగన్ సీఎం అయ్యారు. హైకోర్టులో వైఎస్ వివేకా హత్యపై దాఖలైన పిటీషన్లపై గురువారం విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సంచలన కామెంట్ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ కి అప్పగించేందుకు రాష్ట్ర  ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫిబ్రవరి 6కు కేసును వాయిదా వేసింది.ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం లో అనుమానాస్పద  స్థితిలో హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. ఆయన హత్య తర్వాత పరిణామాలపై నాడు అనుమానం వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్ సహా వివేకా భార్య చాలా మంది హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు. తాజాగా వైఎస్ వివేకా కూతురు సునీత కూడా కేసును సీబీఐకి అప్పగించాలంటూ మరో పిటీషన్ దాఖలు చేసింది.ఈ కేసుపై ప్రభుత్వం కూడా తన వాదన వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ తుది దశలో ఉందని.. ఈ సమయంలో దర్యాప్తును సీబీఐకి ఇవ్వల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరుఫున ఏజీ వాదించారు.జగన్ సర్కారు నియమించిన సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 62 మందిని విచారించినా నేరస్థులు ఎవరనేది తేలలేదు. దీంతో సీబీఐ కి అప్పగించాలనే డిమాండ్లు పెరిగి పోతున్నాయి.

Related Posts