కార్యకర్తల అత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్-బిజెపి కలయిక
మాజీ ఎంపీ ..వీహెచ్,
హైదరాబాద్ జనవరి 30
కాంగ్రెస్ పార్టీ సిద్దాంతం ఏమైనా మారిందా అనే అనుమానం కల్గుతుందని మాజీ ఎంపీ ..వీహెచ్ అన్నారు.గురువారం గాంధీ భావం లో మేడియా సమావేశం లో మాట్లాడుతూ..బిజేపి పై నిత్యం పోరాటం చేయాల్సిన మా నాయకులు .. బీజేపీ తో కలవడం ఏంటి .మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం మావాళ్ళు కొన్ని దగ్గర్లో బిజెపి తో జతకట్టడం దారుణం ..ఇలాంటి నిర్ణయాలతో నిత్యం బీజేపీ ఆరెస్సెస్ విధానాలపై కొట్లాడే నాయకుల అత్మతైర్యం దెబ్బతింటుంది ..ఇలాంటి నిర్ణయాల వల్ల పార్టీ కి ముస్లిం లు దూరం అవుతారు ..పార్టీ సిద్దాంతం విషయంలో నేను వైయస్ఆర్ నే వదల్లేదు ..పార్టీ అంతర్గత సమావేశం లో చెప్పిన ప్రయోజనం ఉండటం లేదు ..దీని పై అధిష్టానానికి పిర్యాదు చేస్తా నాన్నారు.