YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఆ ఆటగాళ్లకు మరో కొద్దీ గంటల్లో శిక్షలు

Highlights

  • బాల ట్యాంపరింగ్ పై సీఏ నిర్ణయం 
  • శుక్రవారం నాలుగో టెస్టు ప్రారంభం 
ఆ ఆటగాళ్లకు మరో కొద్దీ గంటల్లో శిక్షలు

బాల ట్యాంపరింగ్  ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురికీ  మరో కొద్దీ గంటల్లో శిక్షలు ఖరారు చేయనున్నారు.బుధవారం ఉదయానికి దర్యాప్తు పూర్తవుతుందని, అనంతరం ఈ ముగ్గురికీ శిక్షలు ప్రకటించనున్నారు.  ప్రస్తుతం దర్యాప్తు పూర్తి కావడంతో వారిపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆటగాళ్లు దక్షిణాఫ్రికా విడిచి వెళ్లరాదని ఇది వరకే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదేశాలు జారీ చేసింది. ఈ  వివాదంలో చిక్కుకున్న ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కేమరాన్ బాన్‌క్రాఫ్ట్‌లు ప్రపంచం ముందు నవ్వులపాలైన సంగతి తెలిసిందే. దీనితో బాల్ దక్షిణాఫ్రికాతో జరగనున్న చివరి టెస్టులో వారు ఆడే అవకాశం లేదని, దీంతో వారిని స్వదేశం పంపిస్తున్నట్టు తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 1-2తో వెనకబడింది. శుక్రవారం నుంచి చివరిదైన నాలుగో టెస్టు ప్రారంభం కానుండగా ఈ ముగ్గురి స్థానాలను మ్యాట్ రెన్షా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోయ్ బర్న్‌లతో భర్తీ చేయనున్నట్టు సమాచారం.

Related Posts