YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 నెలలో ముగ్గురు కలెక్టర్లు 

 నెలలో ముగ్గురు కలెక్టర్లు 

 నెలలో ముగ్గురు కలెక్టర్లు 
వరంగల్, జనవరి 31,
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కేవలం వారం రోజుల గడువే ఉండగా, రెండు రోజుల క్రితం ములుగు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ను ప్రభుత్వం అకస్మాత్తుగా మార్చింది. గడిచిన 40 రోజుల్లో ముగ్గురు కలెక్టర్లు మారడం చర్చనీయాంశమవుతోంది.తెలంగాణ రాష్ట్రంలోనే అతిచిన్న జిల్లా ములుగు. 2019 ఫిబ్రవరి 17 నుంచి ఉనికిలోకి వచ్చింది. తొలుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కొద్ది రోజులకే పూర్తిస్థాయి కలెక్టర్గా సి.నారాయణరెడ్డిని నియమించారు. ఆయన ఆధ్వర్యంలోనే ప్రస్తుత మేడారం జాతర పనులు ప్రారంభమయ్యాయి. అంతలోనే  గతేడాది డిసెంబర్22న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఆయనను ట్రాన్స్ఫర్ చేశారు.  నారాయణరెడ్డి కేవలం 9 నెలల 18 రోజులు మాత్రమే పనిచేశారు. ఆయన స్థానంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.  మేడారం జాతర అభివృద్ధి పనుల్లో నిక్కచ్చిగా వ్యవహరించడంతో గిట్టని రాజకీయ నాయకులు నారాయణరెడ్డిని బదిలీ చేయించారనే ఆరోపణలు వచ్చాయి. ములుగు జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే వాసం వెంకటేశ్వర్లు సైతం మేడారం జాతర పనులపై దృష్టి పెట్టారు. పనులను వేగవంతం చేయించడానికి కృషి చేశారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రెండు చోట్ల జెండావిష్కరణ సైతం చేశారు. ఇంతలోనే ములుగు జిల్లా ఇన్చార్జి బాధ్యతల నుంచి వెంకటేశ్వర్లును తప్పించి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్కు అప్పగిస్తూ సీఎస్ సోమేశ్కుమార్  రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ములుగు జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్ను నియమిస్తే అసలు చర్చ ఉండేది కాదు. కానీ కర్ణన్ను కూడా ఇన్చార్జి కలెక్టర్గానే నియమించడంపై తీవ్ర చర్చ జరగుతోంది. మేడారం జాతరకు వారం రోజుల ముందు రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న నిర్ణయంలోని ఆంతర్యమేంటో అంతుచిక్కడం లేదు.2018 మేడారం మహా జాతర ముందు కూడా అప్పటి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళిని ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పట్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్కు భూపాలపల్లి ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. ఇన్చార్జి కలెక్టర్గా మేడారం జాతరను ఆయనే లీడ్ చేశారు. ఇదే సంప్రదాయాన్ని తాజాగా ప్రభుత్వం కొనసాగించింది. 2020 మహాజాతర ముందు కూడా కర్ణన్కే అవకాశం కల్పించడం విశేషం. నాడు కలెక్టర్గా జాతర ను సక్సెస్ చేయడం వల్లే ఆయనకు మరోసారి చాన్స్ ఇచ్చారని  కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం జిల్లా పంచాయతీ అధికారిని సస్పెండ్ చేయాలని తాను ఆదేశించినా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పట్టించుకోకపోవడం వల్లే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆయనను ఇన్చార్జి బాధ్యతలనుంచి తప్పించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు

Related Posts