ఎన్నార్సీకి వ్యతిరేకంగా ముస్లీంల ర్యాలీ
ఖమ్మం జనవరి 31
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నగరంలో సీయేయే, ఎన్నార్సీ బిల్లుకు వ్యతిరేకంగా పట్టణంలో ముస్లింలు, ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు మూయించి నిరసన వ్యక్తం చేసారు. క్రైస్తవ, ముస్లిం మైనార్టీల, దళితులపై కేంద్ర ప్రభుత్వం దారుణమైన వైఖరిని అవలంభిస్తోందని వారు ఆరోపించారు. దేశాన్ని మతం ఆధారంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతోందని ముస్లిం సంఘం నాయకులు ఆరోపించారు. ఏదైనా దేశంలో ముస్లిం, బడుగు బలహీన వర్గాలకు ఇది ప్రమాదకరమని అన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని పెద్ద ఎత్తున సమీకరించి వలసిన అవసరం ఉందని ముస్లిం నాయకులు అన్నారు.