YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏమిటీ జగన్మాయ 

ఏమిటీ జగన్మాయ 

ఏమిటీ జగన్మాయ 
అమరావతి జనవరి 31
పింఛను అర్హత వయసు 5ఏళ్లు తగ్గిస్తే, ఉన్న పింఛన్లు ఇంకా పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉంది. ఏమిటీ జగన్మాయ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం అయన ట్వీట్టర్ లో కామెంట్లు పెట్టారు. 8 నెలల్లో 7లక్షల పించన్లకు కోత పెట్టడం, పండుటాకులను మోసం చేయడం కాదా? 45 ఏళ్లకే బిసి,ఎస్సీ,ఎస్టీ, మైనారిటి మహిళలకు పింఛను ఇస్తామని హామీ ఇచ్చి ఏమార్చడం మోసం కాదా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన రూ 6వేలకు అదనంగా రూ 12,500 ఇస్తామని చెప్పి, రైతులను మోసం చేశారు.  నిరుద్యోగ భృతి రద్దు చేసి యువతకు టోపి పెట్టారు  ఇంత మోసకారి కాబట్టే 12 చార్జిషీట్లలో ఇప్పటికీ 420 సెక్షన్ కింద విచారణ ఎదుర్కొంటున్నారు  అయినా మోసాలు చేయడం మాత్రం మానుకోవట్లేదని అయన వ్యాఖ్యానించారు.

Related Posts