YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

రథసప్తమికి ఏర్పాట్లు

రథసప్తమికి ఏర్పాట్లు

రథసప్తమికి ఏర్పాట్లు
శ్రీకాకుళం జనవరి 31 
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం  అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే రథసప్తమి ఏర్పాట్లను విశాఖరేంజ్ డీఐజీ రంగారావు, ఎస్పీ అమ్మిరెడ్డి, ఆర్డీవో ఎం.వి.రమణ పరిశీలించారు. ఇంద్రపుష్కరిణి ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్లను, వీవీఐపీలు వచ్చి, వెళ్లే రహదారులు, కేశఖండనశాల ఆవరణ, రూ.500, రూ.100, ఉచిత క్యూలైన్లు, దాతల లైన్లు, ప్రసాదాల మండపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1280 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో ఉంటారన్నారు. సామన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రణాళికలు వేశామన్నారు. సామన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. ఎక్కడా తోపులాటలు జరగకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. వీరి వెంట ఆలయ ఈవో హరిసూర్యప్రకాషరావు తదితరులున్నారు.

Related Posts