YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం విదేశీయం

ఏడోసారి ఏడుపే

ఏడోసారి ఏడుపే

ఏడోసారి ఏడుపే
న్యూఢిల్లీ, జనవరి 31 
గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ ఓవర్ కారణంగా టైటిల్‌ని చేజార్చుకున్న న్యూజిలాండ్.. తాజాగా బ్యాక్ టు బ్యాక్ సూపర్ ఓవర్‌లో పరాజయాన్ని చవిచూసింది. మొత్తంగా.. ఆ జట్టు సూపర్ ఓవర్‌లో ఓడిపోవడం ఇది ఏడోసారి.న్యూజిలాండ్‌కి సూపర్ ఓవర్ మళ్లీ కలిసిరాలేదు. హామిల్టన్ వేదికగా గత బుధవారం జరిగిన మూడో టీ20లో భారత్ చేతిలో సూపర్ ఓవర్‌లో ఓడిపోయిన న్యూజిలాండ్.. శుక్రవారం వెల్లింగ్టన్‌లో జరిగిన నాలుగో టీ20లోనూ మరోసారి టీమిండియా చేతిలో సూపర్ ఓవర్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. మొత్తంగా.. 2008 నుంచి ఎనిమిదిసార్లు సూపర్ ఓవర్‌లో ఆడిన న్యూజిలాండ్.. ఒక్క మ్యాచ్‌లో మినహా అన్నింటిలోనూ ఓడిపోయింది. 2010లో క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ ఓవర్‌లో మాత్రమే కివీస్ గెలుపొందింది.వెల్లింగ్టన్‌లో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. ఛేదనలో సరిగ్గా న్యూజిలాండ్ కూడా 7 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేయగలిగింది. దీంతో.. సూపర్ ఓవర్‌ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 13 పరుగులు చేసింది. బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో సైఫర్ట్, కొలిన్ మున్రో చెరొక ఫోర్ బాదారు.సూపర్ ఓవర్‌లో 14 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్‌‌కి ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా 6, 4తో మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దీంతో.. సమీకరణం.. 4 బంతుల్లో 4 పరుగులుగా మారిపోయింది. అయితే.. మూడో బంతికి రాహుల్ ఔటవగా.. నాలుగో బంతికి డబుల్ తీసిన కోహ్లీ.. ఐదో బంతిని బౌండరీకి తరలించి భారత్‌ని గెలిపించాడు. మూడో టీ20 తరహాలో సూపర్ ఓవర్‌‌ని ఈ మ్యాచ్‌లోనూ టిమ్ సౌథీనే వేయడం గమనార్హం.

Related Posts