YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

యువతిపై యాసిడ్ దాడి 

యువతిపై యాసిడ్ దాడి 

యువతిపై యాసిడ్ దాడి 
లక్నో జనవరి 31
ప్రేమించిన వ్యక్తి పనుల్లో పడి తనను పట్టించుకోవడం లేదన్న కోపంతో ఓ యువతి అతడిపై యాసిడ్ పోసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మౌరావణ్ ప్రాంతానికి చెందిన ఓ గ్రామానికి చెందిన పాలకేంద్రం నిర్వహిస్తున్నాడు. స్థానికుల నుంచి పాలను సేకరించి వాటిని ఫ్యాక్టరీకి సరఫరా చేస్తుంటాడు. గురువారం పాలకేంద్రంలో పని చేసుకుంటున్న అతడి వద్దకు ఓ యువతి వచ్చి యాసిడ్ పోసి పరారైంది.ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి లక్నోలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో అతడి మెడ, చెవులు, ఛాతీ, వెనుక భాగంలో కాలిన గాయాలైనట్లు డాక్టర్లు చెప్పారు. యువకుడిపై యాసిడ్ వార్త గ్రామంలో కలకలం రేపింది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. యాసిడ్ దాడికి పాల్పడిన యువతి వివరాలు సేకరించారు. బాధితుడు, యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఇటీవల వ్యక్తిగత పనుల్లో బిజీగా మారిన అతడు తనను పట్టించుకోవడం లేదన్న కోపంతోనే ఆమె యాసిడ్ పోసినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Related Posts