YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

రైల్వేలకు సౌరవిద్యుత్‌‌‌‌ :రైల్వే ట్రాక్‌ల పొడవునా సోలార్ పవర్ ప్యానెళ్లు

రైల్వేలకు సౌరవిద్యుత్‌‌‌‌ :రైల్వే ట్రాక్‌ల పొడవునా సోలార్ పవర్ ప్యానెళ్లు

రైల్వేలకు సౌరవిద్యుత్‌‌‌‌ :రైల్వే ట్రాక్‌ల పొడవునా సోలార్ పవర్ ప్యానెళ్లు
2020-21 బడ్జెట్‌లో రవాణా మౌలిక సదుపాయాల కోసం రూ.1.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్  పేర్కొన్నారు. 2020 బడ్జెట్‌లో భాగంగా భారత రైల్వేలపై కీలక ప్రకటన చేశారు. 27000 కిలోమీటర్ల మేర భారత రైల్వే ట్రాక్‌లను విద్యుదీకరిస్తామనీ.. డిమాండ్-సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించేందుకు రైల్వేలకు సౌరవిద్యుత్‌‌‌‌ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకోసం రైల్వే స్వాధీనంలో ఉన్న ట్రాక్‌ల పొడవునా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆమె అన్నారు. దేశంలోని మరిన్ని కీలక పర్యాటక ప్రాంతాలకు కూడా తేజస్ వంటి రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను 2023 నాటికల్లా పూర్తిచేస్తామని ఆమె పేర్కొన్నారు.

Related Posts