YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విదేశీయం

 చైనాలో దారుణం...

 చైనాలో దారుణం...

 చైనాలో దారుణం...
కనిపించని మానవత్వం
బీజింగ్, ఫిబ్రవరి 1,
కరోనా ఎఫెక్ట్ తో చైనాలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. పది వేల మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ కారణంగా చైనాలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ ప్రజారవాణా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ వైరస్‌కు మూల కేంద్రమైన వుహాన్ నగరాన్ని దాదాపుగా మూసివేశారు. అక్కడక్కడా మాస్కులతో జనం తిరుగుతున్నప్పటికీ.. వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కరోనా భయం ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టే ఘటన ఒకటి చైనాలో చోటు చేసుకుంది.వుహాన్‌లోని ఓ వీధిలో ఓ వృద్ధుడు ఫుట్ పాత్‌ మీద చనిపోయి ఉండగా.. కరోనా భయంతో ఎవరూ అతణ్ని పట్టించుకోలేదు. ఫేస్ మాస్క్ ధరించి, ఓ చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్‌తో తెల్ల జుట్టుతో ఫుట్‌పాత్ మీద పడి ఉన్న అతణ్ని జనం పట్టించుకోలేదు. జర్నలిస్టులు శవాన్ని గమనించి ఫొటోలు తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాసేపటి తర్వాత పూర్తి మాస్కులు, రక్షణ సూట్‌ ధరించిన పోలీసులు, మెడికల్ స్టాఫ్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే శవాన్ని బ్లూ బ్లాంకెట్‌లో చుట్టి అక్కడి నుంచి తీసుకెళ్లారు. వైరస్ సోకే అవకాశం ఉందనే భయంతో అటుగా ఎవరూ రాకుండా అడ్డు ఏర్పాటు చేశారు.చనిపోయిన వ్యక్తికి 60 ఏళ్లు ఉంటాయని భావిస్తుండగా.. అతడు ఎలా చనిపోయాడో తెలియలేదు. పోలీసులు పూర్తి జాగ్రత్తలు తీసుకొని రావడం, జనం ఎవరూ రోడ్డు పక్కన పడి ఉన్న శవాన్ని పట్టించుకోకపోవడాన్ని బట్టి.. కరోనా వైరస్ గురించి జనం ఏ స్థాయిలో భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అతడు వైరస్ కారణంగానే చనిపోయి ఉంటాడని.. అందుకే అతడు దగ్గరికి వెళ్లడానికి సాహసించలేదని ఓ మహిళ తెలిపారు. చాలా మంది చనిపోతున్నారు, పరిస్థితి భయానకంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.కరోనా వైరస్ ఇతర దేశాలకూ విస్తరిస్తుండంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. వైరస్ ఉధృతిని అరికట్టడం కోసం నగరానికి విమానాల రాకపోకలను నిషేధించారు. రోడ్లను కూడా మూసివేశారు.

Related Posts