YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దేశ రాజధాని ఢిల్లీ కి పయనమైన అమరావతి రైతులు 

దేశ రాజధాని ఢిల్లీ కి పయనమైన అమరావతి రైతులు 

దేశ రాజధాని ఢిల్లీ కి పయనమైన అమరావతి రైతులు 
విజయవాడ ఫిబ్రవరి 1 
రాష్ట్ర ప్రభుత్వం మంకుపట్టుతో తమ గోడు పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరేందుకు రాజధాని అమరావతి రైతులు సమాయత్తం అయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ కి వారు బయలుదేరారు. రాజధాని రైతులు గత 45 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం వారివైపు కన్నెత్తి కూడా చూడని విషయం తెలిసిందే.దాంతో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు జేఏసీ నిర్ణయించింది. జేఏసీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా తో పాటు 10 మంది కేంద్రమంత్రులను రైతులు కలవనున్నారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని  మూడు రాజధానులు వద్దంటూ తమ గోడును కేంద్రానికి వారు విన్నవించబోతున్నారు.

Related Posts