YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖపట్నంలో జగన్ సర్కార్ 6,116 ఎకరాల భూ కుంభకోణం

విశాఖపట్నంలో జగన్ సర్కార్ 6,116 ఎకరాల భూ కుంభకోణం

 విశాఖపట్నంలో జగన్ సర్కార్ 6,116 ఎకరాల భూ కుంభకోణం
   సీపీఐ ఏపి సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ
అమరావతి ఫిబ్రవరి 1  )
: విశాఖపట్నంలో జగన్ సర్కార్ 6,116 ఎకరాల భూ సమీకరణకు తెరతీయటం.. భూ కుంభకోణానికి నాంది పలకటమే అని సీపీఐ ఆంధ్రప్రదేశ్ సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ ఆరోపించారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో ముదపాక భూముల పూలింగ్, ఓజోన్ వ్యాలీ పూలింగ్ మోసాలు జరిగాయని పేర్కొన్నారు. నాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకించిన వైసీపీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే పని ఎందుకు చేస్తోందని అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల భూములు తీసుకోవటం దారుణం అన్నారు. పేదల జీవనోపాధికి ఇచ్చిన అసైన్డ్ భూములను సేకరించొద్దని డిమాండ్ చేశారు. ఒక పేదకు మేలంటూ మరో పేద కడుపుకొట్టరాదని అన్నారు. జీవో నెంబర్ 72 రద్దు చేయాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు.

Related Posts