బడ్జెట్ ప్రసంగాన్ని రెండు సార్లు అడ్డుకున్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ ఫిబ్రవరి 1
: లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు రెండు సార్లు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. మొదట తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తుందని ‘బీటీ బచావో, బేటీ పడావో’ అని నిర్మలా సీతారామన్ అనగానే ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. దేశంలో మహిళల రక్షణ గురించి బీజేపీ మాట్లాడటం ఏంటంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అనంతరం అవినీతి గురించి మాట్లాడుతున్నప్పుడు సైతం పెద్ద ఎత్తున మోదీ ప్రభుత్వంపై నినాదాలు చేశారు. అయితే ప్రతిపక్షాల అరుపులను ఏమాత్రం పట్టించుకోకుండా తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు నిర్మలా.