జ్యూడిషియల్ క్యాపిటల్ను వెలగపూడి నుంచి కర్నూల్కు షిఫ్ట్
అమరావతి ఫిబ్రవరి 1 br /> జ్యూడిషియల్ క్యాపిటల్ను వెలగపూడి నుంచి కర్నూల్కు షిఫ్ట్ చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పాలనా వికేంద్రీకరణతో రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లెజిస్లేటివ్ క్యాపిటల్టా అమరావతి, జ్యుడీషియల్ క్యాపిటల్గా కర్నూలు, ఎక్సిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్టణాన్ని ఖరారు చేసింది. కాగా, జ్యూడిషియల్ క్యాపిటల్(న్యాయ రాజధాని)గా కర్నూల్లో అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. పాక్షిక న్యాయ విభాగమైన రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్ కార్యాలయాన్ని కర్నూల్కు తరలించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు రాజధానుల ఏర్పాటుకు శాసనసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.