YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఇక డీడీటి ట్యాక్స్ పై మినహాయింపు

ఇక డీడీటి ట్యాక్స్ పై మినహాయింపు

ఇక డీడీటి ట్యాక్స్ పై మినహాయింపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1,
మోదీ సర్కార్ తాజాగా శుభవార్త అందించింది. కేంద్ర బడ్జెట్‌ 2020లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) తొలగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డీడీటీ ట్యాక్స్ తొలగింపు వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.25,000 కోట్లు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.డీడీటీ ట్యాక్స్ తొలగింపుపై మిశ్రమ స్పందన లభిస్తోంది. యస్ సెక్యూరిటీస్ సీనియర్ ప్రెసిడెంట్ అండ్ రీసెర్చ్ హెడ్ అమర్ అంబానీ మాట్లాడుతూ.. డీడీటీ ట్యాక్స్‌ను ఇన్వెస్టర్లకు బదలాయిండచం వల్ల దేశీ ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. డివిడెండ్ తీసుకున్నవారు వారి పన్ను స్లాబ్‌కు అనుగుణంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.కంపెనీలు వాటి వాటాదారులకు అందిస్తున్న డివిడెంట్లపై 20.35 శాతం (సెస్‌లు, సర్‌చార్జీలు కలుపుకొని) డీడీటీ పన్ను చెల్లిస్తున్నాయి. అయితే ఇకపై దీన్ని ఇన్వెస్టర్లు చెల్లించాల్సి ఉంటుంది. డీడీటీ తొలగింపు వల్ల ఇన్వెస్ట్‌మెంట్లు పెరగొచ్చని కేపీఎంజీ ఇండియాకు చెందిన నవీన్ అగర్వాల్ తెలిపారు.టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇండియన్ ఆయిల్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, హిందుస్తాన్ జింక్, హెచ్‌డీఎఫ్‌సీ, వేదాంత, ఐటీసీ, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ఎక్కువ డివిడెండ్లు చెల్లిస్తూ ఉంటాయి. దీంతో వీటికి లాభం కలుగనుంది.డీడీటీ ట్యాక్స్ రద్దు వల్ల విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు బాగా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డీడీటీ ట్యాక్స్ ఇన్వెస్ట్‌మెంట్లకు అడ్డంకిగా ఉందని తెలిపారు. కేవలం అంతేకాకుండా స్టాక్ మార్కెట్లకు కూడా ట్యాక్స్ తొలగింపు సానుకూల అంశమని పేర్కొన్నారు.ప్రస్తుత డీడీటీని పరిశీలిస్తే.. దేశీ కంపెనీలతో డీడీటీ 15 శాతంగా ఉంది. దీనికి సర్‌చార్జ్ 12 శాతం అదనం. అంతేకాకుండా డీడీటీపై 3 శాతం ఎడ్యుకేషన్ సెస్‌ కూడా పడుతుంది. అంటే మొత్తంగా కలుపుకొని డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 20.35 శాతంగా ఉంటుంది.వాటికి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని డివిడెండ్ రూపంలో వాటాదారులకు అందిస్తుంది. డివిడెంట్లపై చెల్లించే పన్నును డీడీటీ అని పిలుస్తారు. కేవలం దేశీ కంపెనీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేని కంపెనీలు కూడా డివిడెండ్ ట్యాక్స్‌ను కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏ ప్రపంచ దేశంలో కూడా డీడీటీ ట్యాక్స్ లేదు.

Related Posts