YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు

పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు

పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు
ముంబై, ఫిబ్రవరి 3,
పసిడి ధర పరుగులు పెట్టింది. భారీగా పెరిగింది. పసిడి ధర రూ.43 వేల మార్క్ దగ్గరకు చేరింది. వెండి ధర ఇక ఏకంగా రూ.50 వేల సమీపంలో కదలాడుతోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడింది. దీంతో పసిడి ధర పైకి కదలింది. అంతేకాకుండా కరోనా వైరస్ ఎఫెక్ట్ సహా చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి రావడంతో ఇన్వెస్టర్లు సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారం వైపు మొగ్గుచూపారు. దీంతో పసిడి మెరిసింది.హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సోమవారం భారీగా పెరిగింది. రూ.420 పరుగులు పెట్టింది. దీంతో బంగారం ధర రూ.38,800 నుంచి రూ.39,220కు చేరింది.అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా జిగేల్‌మంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.420 పెరుగుదలతో రూ.42,330 నుంచి రూ.42,750కు ఎగసింది.బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.140 పైకి కదిలింది. దీంతో ధర రూ.49,850 నుంచి రూ.49,990కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.420 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.39,220కు చేరింది. వెండి ధర రూ.49,990కు పరుగులు పెట్టింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.34 శాతం పెరుగుదలతో 1593.35 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 18.06 డాలర్లకు ఎగసిందిఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగింది. దీంతో ధర రూ.40,050కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.350 పెరుగుదలతో రూ.41,200కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.140 పెరుగుదలతో రూ.49,990కు చేరింది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.రానున్న కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.దేశీ మార్కెట్‌లో బంగారం ధర 2019లో

Related Posts