YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

దేశీయంగా మైక్రోస్కోప్‌ల తయారీ పెరగాలి: గవర్నర్‌

దేశీయంగా మైక్రోస్కోప్‌ల తయారీ పెరగాలి: గవర్నర్‌

దేశీయంగా మైక్రోస్కోప్‌ల తయారీ పెరగాలి: గవర్నర్‌
హైదరాబాద్‌ ఫిబ్రవరి 3  
దేశీయంగా మైక్రోస్కోప్‌ల తయారీ విసృతంగా పెరగాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఇవాళ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో 12వ ఆసియా మైక్రోస్కోపిక్‌ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. దేశీయంగా మైక్రోస్కోప్‌ల తయారీ పెరగాలన్నారు. సునిషిత పరిశీలన, పరిశోధనలకు మైక్రోస్కోప్‌లు ఎంతగానో దోహదపడతాయని గవర్నర్‌ తెలిపారు. మనిషి అపోహలను, మూఢనమ్మకాలను మైక్రోస్కోప్‌ తుడిచిపెట్టిందని గవర్నర్‌ గుర్తుచేశారు. కంటికి కనిపించని పరిమాణంలో ఉన్న జీవుల్ని విజువలైజ్‌ చేసే పరిజ్ఞానం మైక్రోస్కోప్‌లదని ఆమె వెల్లడించారు. ప్రపంచం ఈ విధంగా అభివృద్ధి సాధించిందంటే మూలకారణం మైక్రోస్కోపేనని గవర్నర్‌ ఈ సందర్భంగా తెలిపారు.కార్యక్రమంలో భారత సైంటిస్టులతో పాటు ఆసియా దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Related Posts