YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

శారదా పీఠం వార్షికోత్సావాల్లో సీఎం వైఎస్ జగన్

శారదా పీఠం వార్షికోత్సావాల్లో సీఎం వైఎస్ జగన్

 

శారదా పీఠం వార్షికోత్సావాల్లో సీఎం వైఎస్ జగన్
విశాఖపట్నం ఫిబ్రవరి 3
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సావాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. సోమవారం ఉదయం  శారద పీఠం చేరుకున్న సీఎం వైఎస్ జగన్కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దాదాపు రెండు గంటల పాటు వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.  పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, త్మానందేంద్రలతో కలిసి శారదా పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి పూజల చేశారు. పీఠాధిప తులతో కలిసి జమ్మిచెట్టు ప్రదక్షిణ చేసిన సీఎం వైఎస్ జగన్.. గోమాత కు నైవేద్యం సమర్పించారు. పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆగమ యాగశాలలో ఐదు రోజులుగా జరుగుతున్న శ్రీనివాస చతుర్వేద హవనం, విశ్వశాంతి హోమాలను సీఎం సందర్శించారు. సీఎం వైఎస్ జగన్తోపాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ కార్యాక్రమంలో పాల్గొన్నారు.

Related Posts