YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య కోల్డ్‌వార్

హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య కోల్డ్‌వార్

హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య కోల్డ్‌వార్
కర్నూలు ఫిబ్రవరి 3
);: జిల్లాకు చెందిన వైసీపీ నేతల్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య కోల్డ్‌వార్ నెలకొంది. తనతో చెప్పకుండా కార్యకర్తలను ఎస్వీ చేర్చుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.!. ఒక్క మాటైనా చెప్పుకుండా ఇలా చేయడమేంటి..? అని ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దమ్ముంటే.. పత్తికొండ, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో కూడా స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పకుండా మిగతా వారిని పార్టీలో చేర్చుకోవాలని మోహన్‌రెడ్డికి హఫీజ్‌ఖాన్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హఫీజ్.. ఎస్వీపై నిప్పులు చెరిగారు.కాగా  ‘నన్ను కొట్టండి నేను ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తాను.. కానీ మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు. మా కార్యకర్తలపై దాడులు చేస్తే, మేము చూస్తూ ఉరుకోం. వారికి అండగా ఉంటాం. కర్నూలును అన్నివిధాలా మంచి చేస్తానని ముఖ్యమంత్రి నాతో చెప్పడం అది జగన్ మంచి తనానికి నిదర్శనం’ అని హఫీజ్ చెప్పుకొచ్చారు.కాగా.. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలోకి జంప్ అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి టాటా చెప్పిన ఆయన.. మళ్లీ సొంత గూడైన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆయనకు అధిష్టానం షాకిచ్చి.. అప్పటికే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనుకున్న హఫీజ్‌‌కే టికెట్ ఇచ్చి పార్టీ గెలిపించుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి నేటి వరకూ వీరిద్దరి మధ్య విభేదాలతో పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇలా తరుచు వివాదాలతో కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.!. ఈ వ్యవహారంపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Related Posts