చంద్రబాబు దళిత వ్యతిరేకి
తాడేపల్లి ఫిబ్రవరి 03
ఎంపి నందిగం సురేష్ పై దాడి చంద్రబాబు అకృత్యాలకు పరాకాష్ట. అయన పై దాడి వెనక పెద్ద కుట్ర దాగిఉంది. నందిగం సురేష్ పై పెయిడ్ వర్కర్స్ తో చంద్రబాబు దాడిచేయించారని వైకాపా ఎమ్మెల్యే మేరుగునాగార్జున ఆరోపించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. అంటరానితనం చంద్రబాబు మదిలో,ఆలోచనలో ఉంది. మా నాయకుడు వైయస్ జగన్ మాకు పోరాడటం నేర్పించారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. చంద్రబాబూ...అసెంబ్లీలో ఎస్సి కమీషన్ విషయంలో బిల్లుపెడితే వ్యతిరేకించావు. మండలిలో మోకాలడ్డావు. చంద్రబాబు ఆయన గ్యాంగ్ దళితులను టార్గెట్ చేస్తున్నారు. గతంలో మా ఎంఎల్ ఏలు కైలే అనిల్ కుమార్, శ్రీదేవి పై దాడులు చేయించావని విమర్శించారు. రాష్ర్టంలో సంక్షేమం, అభివృధ్దికి శ్రీ వైయస్ జగన్ ముందుకు వెళ్తుంటే ఆయనను అభాసుపాలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. -శ్రీభాగ్ ఒప్పందంలోని అంశాలను పరిశీలించి,అనేక అధ్యయనాల తర్వాత శ్రీవైయస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు తీసుకువెళ్తుంటే చంద్రబాబు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పేదప్రజలకోసం వైయస్ జగన్ అనేక చట్టాలు తెస్తున్నారు. అమరావతిలో నీ ఉద్యమానికి కారణం నీవు కొల్లగొట్టిన నీ ఆస్దులు పోతాయనే వాటిని కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తున్నావని మండిపడ్డారు. నీ ఆలోచన ఏంటంటే వైయస్ జగన్ పే నీకున్న చెంచా మీడియాల ద్వారా దుష్ప్రచారానికి ప్రయత్నిస్తున్నావు. వైయస్ జగన్ సిఎం అయ్యాక పార్టీలు,కులాలు,మతాలు,ప్రాంతాలకతీతంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. అభివృధ్ది సంక్షేమపధకాలు ప్రతి ఇల్లు తడుతున్నాయి. పెన్సన్లు డోర్ డెలివరీతో ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే రెండుకోట్లమందికి సంక్షేమపధకాలు అందాయి. దళితుల భూములను లాక్కుని చంద్రబాబు తన బినామిలకు అప్పగించారని విమర్శించారు