YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

శ పోలీస్ స్టేషన్, ప్రత్యేక యాప్ ప్రారంభోత్సవం అంశాలపై సిఎస్ సమీక్ష

శ పోలీస్ స్టేషన్, ప్రత్యేక యాప్ ప్రారంభోత్సవం అంశాలపై సిఎస్ సమీక్ష

దిశ పోలీస్ స్టేషన్, ప్రత్యేక యాప్ ప్రారంభోత్సవం అంశాలపై సిఎస్ సమీక్ష
అమరావతి, ఫిబ్రవరి 3 br /> ఈనెల 7వ తేదీన రాజమండ్రిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిచే ప్రారంభించనున్న దిశ పోలీస్ స్టేషన్, ప్రత్యేక యాప్ తదితర ప్రారంభోత్సవ కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు అమరావతి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఇందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై సిఎస్ సమీక్షిస్తూ 7వ తేదీన రాజమండ్రిలో సీఎం దిశ పోలీస్ స్టేషన్, ఒన్ స్టాప్ సెంటర్లను ప్రారంభించనున్నారని తెలిపారు. తదుపరి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోసీజర్ (ఎస్ఓపి) ప్రారంభించడంతో పాటు దిశ చట్టానికి సంబంధించి పోలీస్, వైద్య ఆరోగ్యం, ఒన్ స్టాప్ కేంద్రాల సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫోరెన్సిక్ సిబ్బంది, పలువురు డాక్టర్లు, విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించే శిక్షణా కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన కార్యక్రమాలను రాష్ట్ర స్థాయి శాఖలతో పాటు జిల్లా కలెక్టర్ నేతృతంలో జిల్లా స్థాయిలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సక్రమంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంకా ఇందుకు  సంబంధించి వివిధ అంశాలపై సిఎస్ నీలం సాహ్ని అధికారులతో సమీక్షించారు.


ఈ సమావేశంలో హోం, స్త్రీ శిశు సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శులు కిషోర్ కుమార్, కె.దమయంతి, సిఐడి పోలీస్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి, దిశ చట్టం పోలీస్ ప్రత్యేక అధికారి దీపిక తదితరులు పాల్గొన్నారు.

Related Posts