YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లాంగ్ లీవ్ లోకి ఏపీసీఎస్..?

లాంగ్ లీవ్ లోకి ఏపీసీఎస్..?

లాంగ్ లీవ్ లోకి ఏపీసీఎస్..?
విజయవాడ, ఫిబ్రవరి 3
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్నీ లాంగ్ లీవ్‌పై వెళ్లేందుకు? జగన్ సర్కార్ వైఖరితో ఆమె అసహనంతో ఉన్నారా?..  రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎస్ దీర్ఘకాలిక సెలువుపై వెళ్లాలని భావిస్తున్నారని.. ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా టీడీపీ సోషల్ మీడియా పేజీలతో పాటూ కొందరు నెటిజన్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహానీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నట్టు సమాచారం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు ఆమె కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి ఆమెను ప్రత్యేకంగా రాష్ట్రానికి పిలిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా నియమించారు. 2019 నవంబర్‌లో ఆమెను ఏపీ సీఎస్‌గా నియమిస్తున్నట్టు ఉత్వర్వులు వచ్చాయి. అనంతరం నవంబర్ 17న ఆమె ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు తాత్కాలిక సీఎస్‌గా విధులు నిర్వహిస్తున్న నీరబ్ కుమార్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారుజగన్ సర్కార్ తీరు నచ్చకే ఆమె లాంగ్ లీవ్‌లో వెళ్లాలని భావిస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ వ్యవహారం.. మూడు రాజధానుల రగడ.. హైకోర్టు వరుస తీర్పులు ఇలా సీఎస్ నీలం సాహ్నీ దీర్ఘకాలిక సెలవుల వెనుక చాలా కారణాలు ఉన్నాయన్నది టీడీపీ వర్గాల వాదన.మూడు రాజధానుల తరలింపుపై జగన్ సర్కార్ పట్టుదలతో ఉంది. అమరావతి రైతుల ఆందోళనలు, రాజధాని తరలింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. సచివాలయం, ఇతర కార్యాలయాలను విశాఖకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని హైకోర్టు దృష్టికి వెళ్లగా.. ఒకవేళ ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తే అధికారులను బాధ్యుల్ని చేస్తామని కోర్టు హెచ్చరించింది.కోర్టు హెచ్చరించినా.. జగన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయం, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుల కార్యాలయాల్ని కర్నూలుకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడే అసలు తలనొప్పి మొదలయ్యింది.. ఓవైపు కోర్టు ప్రభుత్వ కార్యాలయాలను తరలించొద్దని చెప్పింది.. ఇటు ప్రభుత్వం కార్యాలయాలను తరలించేందుకు ఆదేశాలు ఇచ్చింది.కోర్టు ఆదేశాలను అనుసరించాలా.. ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాలా అన్న ఒత్తిడి సీఎస్‌కు ఎదురయ్యిందని.. అందుకే ఆమె లాంగ్ లీవ్‌పై వెళుతున్నారని టీడీపీ వర్గం వాదన. అందుకే సీఎస్ సెలవు మీద వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఐఆర్ఎస్ కృష్ణ కిషోర్ వ్యవహారంలో క్యాట్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒత్తిడి పెంచాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు కొందరు ఒకడుగు ముందుకేసి ఆమె రాజీనామాకు సిద్ధమయ్యారనే ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.. ఇటు సీఎస్, ప్రభుత్వ వర్గాలు స్పందించలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.నీలం సాహ్నీ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి.. ఏపీకి రాకముందు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను పక్కన పెట్టి మరీ.. జగన్ ఏరి కోరి సాహ్నీని రాష్ట్రానికి పిలిపించారు. అంతేకాదు ఆమె ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా గుర్తింపు వచ్చింది. గతేడాది నవంబర్‌లో ఏపీ సీఎస్‌గా నియమించారు. నవంబర్ 17న బాధ్యతలు స్వీకరించారు. సాహ్నీకి 2020 జూన్ 30 వరకు పదవీ కాలం ఉంది.

Related Posts