YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానులు పై జగన్ దూకుడు

మూడు రాజధానులు పై జగన్ దూకుడు

మూడు రాజధానులు పై జగన్ దూకుడు
విజయవాడ, ఫిబ్రవరి 3
మూడు రాజధానుల దిశగా దూకుడు పెంచారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. కర్నూలుకు ఏపీ విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయం, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుల కార్యాలయాల్ని తరలిస్తూ గత శనివారం ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ ఆఫీసుల్ని కర్నూలుకు తరలించడానికి తగిన భవనాలను గుర్తించాలని ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్, కర్నూలు జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే విశాఖకు సంబంధించిన జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని మధురవాడ సమీపంలో ఉన్న మిలీనియం టవర్‌-బి నిర్మాణం కోసం రూ.19.73 కోట్లు విడుదల చేసింది. ఐటీశాఖకు ఈ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖకు సెక్రటేరియట్‌ను తరలిస్తే.. మిలీనియం టవర్స్‌లోనే కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇదిలా ఉంటే రాజధాని తరలింపుపై హైకోర్టులో పిటిషన్లు కొనసాగుతున్నాయి. కోర్టు కూడా ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించొద్దని ప్రభుత్వానికి సూచించింది. తాజాగా కర్నూలుకు పలు ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించడాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వాన్ని కూడా చేర్చాలని కోరారు. ఈ పిటిషన్లపై నడుస్తుండగానే.. కోర్టు హెచ్చరించినా జగన్ సర్కార్ మాత్రం తమ పని తాము చేసుకొని పోతోంది.

Related Posts