YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

నష్టాలకు చెక్

Highlights

✺ నిఫ్టీ 50లో ఏసియన్ పెయింట్స్, నెస్లే, హెచ్‌యూఎల్, బ్రిటానియా, బజాజ్ ఆటో షేర్లు లాభపడ్డాయి. ఏసియన్ పెయింట్స్ 6 శాతానికి పైగా పెరిగింది.
✺ అదేసమయంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్, యస్ బ్యాంక్, ఐటీసీ, గెయిల్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్ 6 శాతానికి పైగా పడిపోయింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ ఐటీ కూడా 1 శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా కూడా క్షీణించింది. ఇక మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ఉండిపోయాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా పెరిగాయి.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. 7 పైసలు క్షీణతతో 71.43 వద్ద కదలాడుతోంది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.48 శాతం తగ్గుదలతో 56.35 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.21 శాతం పెరుగుదలతో 51.67 డాలర్లకు చేరింది

నష్టాలకు చెక్

నష్టాలకు చెక్
ముంబై, ఫిబ్రవరి 3
దేశీ స్టాక్ మార్కెట్ నష్టాలకు అడ్డుకట్ట పడింది. బడ్జెట్ 2020 ఎఫెక్ట్‌తో పడిపోతూ వచ్చిన బెంచ్‌మార్క్ సూచీలు ఈరోజు పైకి కదిలాయి. ఆటో, మెటల్ రంగ షేర్ల జోరుతో మార్కెట్ సోమవారం లాభాల్లోనే క్లోజయ్యింది.సెన్సెక్స్ 136 పాయింట్ల లాభంతో 39,872 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 11,708 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. షార్ట్ కవరింగ్ వల్ల మార్కెట్ లాభాల్లో క్లోజయ్యిందని నిపుణులు పేర్కొంటున్నారు.

Related Posts