తెరాసపై బీజేపీ ఫిర్యాదు
సికింద్రాబాద్ ఫిబ్రవరి 3
ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ అవకతోవకాలకు పాల్పడి గెలిచింది అంటూ ఈసీకి బీజేపీ నాయకులు పిర్యాదు చేసారు. అధికార టిఆర్ఎస్ పార్టీ బడంగి పేట్ మున్సిపాలిటీ ఐదవ వార్డులో వేరేపార్టీల ఓటర్ల పేర్లను గల్లంతు చేసి, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిందని వారు ఆరోపించారు. ప్రభుత్వ అండదండలతో వారంతా గెలిచారు అంటూ సికింద్రాబాద్ బుద్ధ భవన్ లో ఉన్న చిప్ ఎలక్షన్ కమిషన్ కు బిజెపి నాయకురాలు బడంగి పేట్ ఐదవ వార్డు బీజేపీ అభ్యర్ది శిరీష శివారెడ్డి పిర్యాదు చేసారు. సిఇఓ రజత్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో ఓఎస్డీ ప్రభాకర్ పిర్యాదు పత్రాన్ని అందజేసారు. అధికార టిఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ అధికార దుర్వినియోగాయానికి పాల్పడి మా లాంటి గెలిచే సీట్లను గెలువకుండా గెలువకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.