ఎన్ ఆర్ సి పై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ ఫిబ్రవరి 04
దేశవ్యాప్తంగా ఎన్ ఆర్ సి అమలుపై కేంద్రం మంగళవారం కీలక ప్రకటన చేసింది. జాతీయస్థాయిలో ఎన్ఆర్సి పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీంతో గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అందోళనలు, నిరసనలకు ముగింపు వస్తుందని కేంద్ర భావిస్తోంది. గత శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేసిన ప్రసంగంలో ఎన్నార్సీ ని ప్రస్తావించలేదు. పలు బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నారితోపాటు సీయేయేకు దూరమని ప్రకటించిన విషయం తెలిసిందే.