YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 కేటీఆర్‌ను సీఎం చేయి తల్లీ సమ్మక్కకు సిరికొండ ప్రశాంత్‌ మొక్కులు

 కేటీఆర్‌ను సీఎం చేయి తల్లీ సమ్మక్కకు సిరికొండ ప్రశాంత్‌ మొక్కులు

 కేటీఆర్‌ను సీఎం చేయి తల్లీ సమ్మక్కకు సిరికొండ ప్రశాంత్‌ మొక్కులు
వరంగల్‌ ఫిబ్రవరి 04
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావును రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలంటూ మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూధనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్‌, క్రాంతి సోమవారం నాడు మేడారంలో సమ్మక్క-సారలమ్మను మొక్కుకున్నారు. సుమారు వెయ్యి మంది యువకులు భక్తితో ర్యాలీగా మేడారం చేరుకొని వనదేవతల గద్దెల వద్ద మొక్కు చెల్లించారు. అనంతరం ప్రశాంత్‌ విలేకరులతో మాట్లాడుతూ, ప్రపంచదేశాలలోని పారిశ్రామిక వేత్తలతో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు, పార్టీని క్రమశిక్షణతో ముందుకు నడిపించగల సత్తా కేటీఆర్‌కు ఉందన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఏకతాటిపై నడిపించి పూర్తి విజయాన్ని చేకూర్చినందుకు ఆయనను  సిరికొండ ప్రశాంత్‌ అభినందించారు. ఈ మొక్కుబడిలో భూపాలపల్లి నియోజకవర్గంలోని సుమారు 15 గ్రామాలకు చెందిన యువకులు పాల్గొన్నారు. 

Related Posts