ఎన్నార్సీ చట్టాలకు వ్యతిరేకంగా, రాకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి ..
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు ఫిబ్రవరి 05
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేఖరుల సమావేశం నిర్వహించారు. భారతీయులపాలిట ఉరితాడులా సీయేయే, ఎన్నార్సీ, ఎన్పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా, రాకీయాలకు అతీతంగా పోరాటం చేయాలని అన్నారు. ఈ చట్టాలపై ఇప్పటికే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అమలు చేయవద్దని స్పష్టంగా జి.ఓ. జారీ చేసారని అన్నారు. మూడు రాజధానులను శాసనమండలిలో అడ్డుకున్నామని అనే చెప్పే తెలుగుదేశం నాయకులు శాసనమండలిలో ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు తీర్మానం చేయలేదో చెప్పాలని అయన అన్నారు.