YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి

 మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి

 మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి
కడప ఫిబ్రవరి 05
ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిది. రాష్ట్రానికి దుష్టత్రయంగా దాపురించిన బిజెపి, వైసీపీ, టీడీపీ పార్టీలని ఎపిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. బుధవారం అయన నగరంలోని ఇందిరా భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.  20 పైగా ఎంపీలను ఇవ్వడి ప్రత్యేక హోదా సాధిస్తామని పిట్టలదొర కథలు జగన్ చెప్పారు. అధికారంలోకి రాగానే విభజన హామీలు అమలు చేస్తామని బీజేపీ,  అంతర్జాతీయ రాజధాని అంటూ అరచేతిలో వైకుంఠం చూపిన చంద్రబాబు, మూడు రాజధానులు పేరుతో కైలాసం చూపుతున్న జగన్ అని విమర్శించారు. ఇద్దరు కలిసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజధాని మారదు అని చెప్పి ఇప్పుడు జగన్  మాట మార్చారు. అప్పుడే మూడు రాజధానులు అని చేప్పి ఉంటే ఎన్నికల్లో తెలిసేది 151 స్థానాలా లేక 21 స్థానాలనేది. మూడు రాజధానులకోసం అసెంబ్లీ ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికల కు వెళ్లాలని అయన డిమాండ్ చేసారు.

Related Posts