అన్ని తనకే తెలుసు అని విదంగా ప్రవర్తిస్తున్న కెసిఆర్: సమరసింహరెడ్డి
హైదరాబాద్ ఫిబ్రవరి 5
ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని తనకే తెలుసు అని విదంగా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి డీకే సమరసింహరెడ్డి విమర్శించారు.బ్య్దవరామ్ గాంధీ భవన్ లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి తో కలిసి మాట్లాడరు. రెవెన్యూ చట్టాలు మారిస్తే అవి ప్రజలకు మరింత మేలు చేయాలన్నారు.ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ చట్టాలు చాలా బాగున్నాయి.ఇప్పటికే ఉన్న చట్టాలను పరిగణలోకి తోసుకొని కొత్త చట్టాలను పరిశీలించాలన్నారు.గతంలో పంచాయతీ చట్టం తెచ్చినప్పుడు తానే ఛైర్మెన్ గా ఉన్నాను.. ప్రజల వద్దకు వెళ్లి పరిశీలన చేసాము. అల్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రతిపాదనలు తీసుకున్నవిషయాన్నిఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.కానీ నేడు కేసీఆర్ అన్ని తనకే తెలుసు అని విదంగా ప్రవర్తిస్తున్నారన్నారు.ప్రజలకు మేలు చేయడం కోసం మనలను ఎన్నిక చేసుకున్నారు. అలాంటి పరిస్థితిలో ఒక చట్టం చేయాలంటే ప్రజలకు అనుకూలంగా ఉండాలని హితవు పలికారు.కాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదనలు తీసుకోవాలితప్పఅంత మనకే తెలుసు అనికోవడం మంచిది కాదన్నారు.