YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

దిగొచ్చిన బంగారం ధరలు

దిగొచ్చిన బంగారం ధరలు

దిగొచ్చిన బంగారం ధరలు
ముంబై, ఫిబ్రవరి 6,
పసిడి ధర మరోసారి పడిపోయింది. బంగారం వెలవెలబోయింది. పసిడి ధర తగ్గడం ఇది వరుసగా మూడో రోజు కావడం గమనార్హం. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగా శుభవార్త అని చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర భారీగానే దిగొచ్చింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగినప్పటికీ భారత్ మార్కెట్‌లో మాత్రం పసిడి ధర పడిపోయింది. అధిక ధరల నేపథ్యంలో దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గుతూ రావడం కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.ఇంకా దేశీ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి రికవరీ బాటపట్టడం వల్ల పసిడి ధర తగ్గడానికి దోహదపడింది. చైనా వడ్డీ రేట్ల తగ్గింపు కూడా పసిడిపై నెగటివ్ ఎఫెక్ట్ పడేలా చేసింది.గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరుగుదలతో 1560.02 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 17.60 డాలర్లకు ఎగసింది.హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం భారీగానే దిగొచ్చింది. ఏకంగా రూ.470 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.42,450 నుంచి రూ.41,980కు పడిపోయింది.అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గుదలతో రూ.38,770 నుంచి రూ.38,480కు క్షీణించింది.బంగారం ధర పడిపోతే.. వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర మళ్లీ రూ.500 పతనమైంది. దీంతో ధర రూ.48,500 నుంచి రూ.48,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణం.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.38,480కు క్షీణించింది. వెండి ధర రూ.48,000కు పతనమైంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయిఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 క్షీణించింది. దీంతో ధర రూ.39,300కు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 తగ్గుదలతో రూ.40,500కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర రూ.500 పతనమై రూ.48,000కు పడిపోయింది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.పసిడి రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది ఏకంగా 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు కారణంగా చెబుతున్నారు.

Related Posts