YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మినిస్టర్ ఫోన్ చోరి...తెలంగాణలో లభ్యం

మినిస్టర్ ఫోన్ చోరి...తెలంగాణలో లభ్యం

మినిస్టర్ ఫోన్ చోరి...తెలంగాణలో లభ్యం
విజయవాడ, ఫిబ్రవరి 6         
ఏపీ మంత్రి ఫోన్ చోరీ కావడం కలకలంరేపింది. సాక్షాత్తూ సచివాలయంలోనే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. మంత్రి బుధవారం సెక్రటేరియట్‌కు వచ్చారు.. పలు సమావేశాల్లో పాల్గొని.. అక్కడి నుంచి ఆర్థికశాఖ సమీక్షకు వెళ్లారు. ఆ తర్వాత కొంతమంది సందర్శకుల్ని కలిసి.. అనంతరం క్యాంటిన్‌లో భోజనానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి తన పేషీకి వెళ్లిన తర్వాత మంత్రి ఫోన్ కనిపించలేదట.. వెంటనే అప్రమత్తమై మొబైల్ గురించి ఆరా తీశారు.మొబైల్ కోసం క్యాంటిన్‌తో పాటూ మరికొన్ని చోట్ల వెతికినా కనిపించలేదు.. చివరికి చోరీకి గురైనట్లు మంత్రి, భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ ఫోన్ గురించి ఆరా తీయగా.. సిగ్నల్స్ ద్వారా ఏపీ సరిహద్దు దాటేసినట్లు తేలింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని మునుగోడు సమీపంలో ఉన్నట్లు తేలింది.. ఫోన్ చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు.. మొబైల్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఆరా తీస్తున్నారు. అయితే కట్టుదిట్టమైన భద్రత.. సీసీ కెమెరాల నిఘా ఉండే సచివాలయంలో ఏకంగా మంత్రి ఫోన్‌ చోరీకావడం కలకలంరేపుతోంది.

Related Posts