YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి 

రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి 

రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి కంది రైతులను వెంటనే ఆదుకోవాలి 44వ జాతీయ రహదారిని  దిగ్బంధం
భారీగా స్తంభించిన ట్రాఫిక్
జోగులాంబ ఫిబ్రవరి 6 
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా లో కందులను మద్దతు ధర తో పూర్తిగా కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాలని జాతీయ రహదారి 44 పై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది రైతులతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటిక్యాల కొనుగోలు కేంద్రాన్ని మళ్ళీ తెరవాలి. ఖాళీ సంచుల కొరత లేకుండా చూడాలి. ఎకరాకు మూడు క్వింటాలు పరిమితిని ఎత్తివేసి కనీసం ఐదు క్వింటాలవరకు కొనుగోలు చేయాలని డిమాంగ్ చేసారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ సంబంధిత అధికారులు స్పందిస్తూ ఫోన్ మాట్లాడి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఉదృతం చేస్తామని ఆయన తెలుపగా... వెంటనే  పరిష్కరిస్తామని  హామీ ఇవ్వడంతో  విరమించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు

Related Posts