YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వరుసగా డౌన్ ట్రెండ్ లో బంగారం

వరుసగా డౌన్ ట్రెండ్ లో బంగారం

వరుసగా డౌన్ ట్రెండ్ లో బంగారం
ముంబై, ఫిబ్రవరి 7, br /> పసిడి ధర తగ్గుతూనే వస్తోంది. వెలవెలబోతోంది. ఈ రోజు కూడా బంగారం ధర పడిపోయింది. పసిడి ధర తగ్గడం ఇది వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర తగ్గితే వెండి మాత్రం నిలకడగా కొనసాగింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినప్పటికీ భారత్ మార్కెట్‌లో మాత్రం పసిడి ధర పడిపోయింది. అధిక ధరల నేపథ్యంలో దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గుతూ రావడం వల్ల కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.ఇంకా దేశీ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి రికవరీ బాటపట్టడం వల్ల బంగారం ధర తగ్గడానికి దోహదపడింది. చైనా వడ్డీ రేట్ల తగ్గింపు కూడా పసిడిపై నెగటివ్ ఎఫెక్ట్ పడేలా చేసింది.గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.43 శాతం పెరుగుదలతో 1569.72 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 1.12 శాతం పెరుగుదలతో 17.79 డాలర్లకు ఎగసింది.హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం కూడా దిగొచ్చింది. రూ.100 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.41,980 నుంచి రూ.41,880కు పడిపోయింది.అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.38,480 నుంచి రూ.38,380కు క్షీణించింది.బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం అక్కడే స్థిరంగా ఉంది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.48,000 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.38,380కు క్షీణించింది. వెండి ధర మాత్రం రూ.48,000 వద్దనే స్థిరంగా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 క్షీణించింది. దీంతో ధర రూ.39,200కు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గుదలతో రూ.40,400కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.48,000 వద్దనే ఉంది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.పసిడి రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.దేశీ మార్కెట్‌లో బంగారం ధర 2019లో ఏకంగా 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Related Posts