YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

 ఆన్ లైన్ లో చైనా మ్యూజియం

 ఆన్ లైన్ లో చైనా మ్యూజియం

 ఆన్ లైన్ లో చైనా మ్యూజియం
బీజింగ్, ఫిబ్రవరి 7,
కరోనా వైరస్ ప్రభావం చైనాపై చాలా కఠినంగా ఉంది. రోజు రోజుకూ పెరుగుతున్న మరణాలతో ఇక్కడ పర్యాటకుల తాకిడి పూర్తిగా పడిపోయింది. దీంతో ఆ దేశ ఆర్ధిక వ్యవస్థతో పాటు అక్కడి ప్రజల ఆనందంపైన కూడా దీని ప్రభావం అధికంగా ఉంది. కానీ ఈ పరిస్థితి చైనాను ఎంత మాత్రం నిరుత్సాహపరచలేదు. చైనీస్ ప్రయాణికులు ఇళ్ల నుంచి బయటకు రాకపోతే ఏమిటి? దేశమే వారి వద్దకు వెళుతుంది అంటూ ఒక కొత్త విధానాన్ని అమలుపరిచారు.చైనాలోని మ్యూజియంలు చైనా మ్యూజియం ప్రియుల కోసం ఆన్ లైన్ ప్రదర్శనలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మ్యూజియంలతో సహా చైనాలో ఇతర పర్యాటక ప్రదేశాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. ఈ నేపధ్యంలో చైనా నేషనల్ కల్చరల్ హెరిటేజ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌సి‌హెచ్ఏ) ప్రజలు తమ సేవలను డిజిటల్ ప్లాట్ ఫామ్ ల ద్వారా పొందడానికి సోషల్ మీడియాలో చురుకుగా ఉండాలని ప్రజలను అభ్యర్ధించారు.చైనా ప్రభుత్వం ప్రకారం... దేశవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వారసత్వ మ్యూజియంలు, ఇతర సంస్థలు డిజిటల్ వనరులను ప్రోత్సహించడానికి, ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి ఇకపై ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలను అందించనున్నాయి. ప్రస్తుతం చైనాలో అనేక మ్యూజియంలు ఆన్ లైన్ ప్రదర్శనలతో ప్రజలను అలరించడం ప్రారంభించాయి. ఈ జాబితాలో బీజింగ్ లోని ప్రఖ్యాత ప్యాలెస్ మ్యూజియం కూడా ఉంది. ఈ సదుపాయాన్ని ప్రజలకు నిరంతరాయంగా అందించేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా నియమించారు.ఈ వర్చువల్ లైబ్రరీలు నేషనల్ కల్చరల్ హెరిటేజ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్ సైట్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ సౌకర్యం చైనా భూభాగంలో నివసించే వారికి మాత్రమే. ప్రజల కోసం 100 కంటే ఎక్కువ ఆన్ లైన్ ప్రదర్శనలు, గ్యాలరీలు ఎన్‌హెచ్‌సిఏ వెబ్ సైట్ నుండి అనుసంధానించబడ్డాయి.ఎన్‌హెచ్‌సిఏ ఒక ప్రకటన విడుదల చేస్తూ 'ఇది మన దేశ సాంస్కృతిక వారసత్వం యొక్క కొత్త సాంకేతిక పరిజ్ఞానం, వారసత్వ కలయికలను ప్రోత్సహిస్తుంది' అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫర్బిడన్ సిటీ తన 600వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. కాబట్టి ప్యాలెస్ మ్యూజియం కొన్ని ఆసక్తికరమైన ప్రదర్శనలను ప్లాన్ చేసింది. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ మ్యూజియం ప్రస్తుతం మూతపడింది.

Related Posts