మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యస్ . రమేష్ కుమార్
అమరావతి ఫిబ్రవరి 7
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికలు మరియు గ్రామీణ ప్రాంతంలోనూ నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తగిన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యన్ . రమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్ పీ లు, ఎన్నికల అధికారులకు సూచించారు. శుక్రవారం 13 జిల్లాల కలెక్టర్లు , యస్ పిలు, ఇతర ఉన్నతాధికారులతో విజయవాడలో ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నుండి వీడియోకాన్పరెన్స్ ఆయన నిర్వహించారు . ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ స్థానిక సంస్థల న్నికలకు సంబంధించి నిబంధనలను , మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్వేచ్చగా , ఖచ్చితత్వంతో , పారదర్శకంగా నిర్వహించే దిశలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలు సంతృప్తికరంగా ఉందన్నారు. ఎన్నికల నిర్వాహణకు సంబంధించి ముఖ్యంగా 7 అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఓటర్ల జాబితా యొక్క సవీనీకరణ ( Updation ) మరియు ముద్రణ . బ్యాలెట్ బాక్స్ లు , ఆర్ ఓలు , ఏఆర్ఓలు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఇఓలు , ఏఇఓలు పురపాలక సంఘాలు మరియు నగర పంచాయతీల పరిధి లోనూ నియమించడం , ఎన్నికల సిబ్బంది . మరియు మైక్రో అబ్జర్వర్ లను గుర్తించడం , ఎ న్నికల సామాగ్రి అయిన ఫార్మ్స్ , కవర్లు , హ్యాండ్ బుక్స్ , ఇతర మెటీరియల్ను సిద్ధం చేసుకోవడం , బ్యాలెట్ పేపర్ల ముద్రణ , ఎంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణ ప్రక్రియలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి ఓట్ల లెక్కింపు వరకు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.