YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అసహనంతో చంద్రబాబు ఆరోపణలు

అసహనంతో చంద్రబాబు ఆరోపణలు

అసహనంతో చంద్రబాబు ఆరోపణలు
అమరావతి 
 ఫిబ్రవరి 7
పెన్షన్ల పై ఇప్పటికీ టీడీపీ బురద జల్లుతూనే ఉంది. 53 లక్షల 70 వేల 210 మందికి పెన్షన్లు ఇచ్చామని మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ఇవి కాకుండా 31 వేల 690 ఆరోగ్యపరమైన పెన్షన్లు ఇచ్చాం. కొత్తగా 6 లక్షల మందికి ఇచ్చాం. 4, 16,034 మందిని ఫించన్ పొందేందుకు అనర్హులుగా గుర్తించామని అన్నారు. వీరిలోను పునః పరిశీలన చేసి పెన్షన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాం. వార్డు వాలంటీర్లు ప్రస్తుతం తనిఖీలో ఉన్నారు. ఈ నెలతో కలిపి వారికి రెండు నెలల పెన్షన్ ఇస్తాం. పెన్షన్ల్ సంఖ్య ను తగ్గించుకోవలన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. 300 యూనిట్లు విద్యుత్ వాడుతున్న వారి సంఖ్య 8 వేలు పైచిలుకు వచ్చింది. వీరి గురించి కూడా పరిశీలన చేస్తున్నాం. అధికారం కోల్పోయి అసహనం తో చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని అయన విమర్శించారు.

Related Posts