పిచ్చోడికి ఏకే 47 ఇచ్చినట్లుంది: తులసీ రెడ్డి
తిరుపతి ఫిబ్రవరి 7
;: వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పాలనపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీది రౌడీ పాలన అని ధ్వజమెత్తారు. పిచ్చోడికి ఏకే 47 ఇచ్చినట్లుందంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏడు నెలల్లో రూ.35వేల కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం సంపాదించిన ఆస్తులను అమ్మి పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. 8 నెలలు అయినా కోడికత్తి కేసు, వివేకా కేసు ఏమైందని ప్రశ్నించారు. మూడు రాజధానుల ఏర్పాటు జగన్ అవివేక నిర్ణయం అని విమర్శించారు.