తొలగించిన పెన్షన్లు తిరిగి ఇవ్వాలి
విజయవాడ ఫిబ్రవరి 7
సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ లో పెన్షన్ల తొలగింపునకు నిరసనగా మాజీ శాసన సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేపట్టిన నిరసన కార్యక్రమంలో దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా తెలుగుదేశం సానుభూతిపరుల పెన్షన్లను తొలగిస్తుందని పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లను నేడు ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని వాలంటీర్ల తో పెన్షన్లను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారని ఇది ముమ్మాటికి దుర్మార్గమైన చర్య అని 200 ఉన్న పెన్షన్లను తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో పది రెట్లు పెంచి 2000 రూపాయలు చేసిందని 3000 రూపాయలు ఇస్తామని ఓట్లు వేయించుకున్న వైసీపీ నేతలు ప్రజలను మోసం చేసి 250 రూపాయలు పెంచి 2250 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని తాము చేసే తప్పుడు ప్రచారాలను మానుకొని తొలగించిన పెన్షన్లు వెంటనే తిరిగి ఇవ్వాలని లేనిచో పెన్షన్లను తిరిగి ఇచ్చే వరకు ప్రజల తరఫున పోరాడతామని దేవినేని హెచ్చరించారు.