YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

14కు వాయిదా పడిన చంద్రబాబు ఆస్తుల కేసు

14కు వాయిదా పడిన చంద్రబాబు ఆస్తుల కేసు

14కు వాయిదా పడిన చంద్రబాబు ఆస్తుల కేసు
విజయవాడ, ఫిబ్రవరి 7 
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తుల కేసుపై ఏసీబీ కోర్టులో కీలక విచారణ జరిగింది. తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు కేసు రిజిస్టర్‌ కాకముందే హైకోర్టు నుంచి స్టే ఎలా తెచ్చుకున్నారని ఆమె కోర్టు ద్వారా ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా రూ.300 తీసుకున్న బాబు.. తర్వాత అక్రమంగా రూ.వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు.ఇటు చంద్రబాబు తరపున లాయర్ తన వాదనల్ని వినిపించారు. లక్ష్మీపార్వతి వాదనలకు కౌంటర్ ఇచ్చారు. హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుపై స్టే ఉందని బాబు తరపు లాయర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఏసీబీ కోర్టు.. ఆ స్టే వివరాలను పరిశీలిస్తామని తెలిపింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని.. ఏసీబీ విచారణకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ స్పెషల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ప్రారంభంకాక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు ఎలా వింటామని చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.ఆ తర్వాత బాబు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపి ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే విధించారు. అనంతరం ఈ స్టేను ఎత్తివేయాలని లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయగా.. హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి ఈ స్టే కొనసాగుతోంది. తర్వాత హైకోర్టు ఇచ్చిన స్టే పొడిగింపు లేకపోవడంతో.. విచారణ ప్రారంభమైంది.

Related Posts