YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

సీఈవోతో ప్రేమాయణం...సీన్ కట్ చేస్తే కటకటాల్లోకి

సీఈవోతో ప్రేమాయణం...సీన్ కట్ చేస్తే కటకటాల్లోకి

సీఈవోతో ప్రేమాయణం...సీన్ కట్ చేస్తే కటకటాల్లోకి
హైద్రాబాద్, ఫిబ్రవరి 7
అదో సాఫ్ట్‌వేర్ కంపెనీ.. అక్కడ ఓ యువకుడు ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ఇంతలో ఆ కంపెనీకి సీఈవోగా ఓ అందమైన యువతి వస్తుంది. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి ప్రేమలోకి దింపి చివరికి పెళ్లి చేసుకుంటాడు మన హీరో. సినిమాల్లో తరచూ ఇలాంటి స్టోరీలు చూస్తుంటాం. ఇక్కడ నిజ జీవితంలోనూ ఓ వ్యక్తి అచ్చం ఇలాగే చేయాలనుకున్నాడు. కానీ, కథ అడ్డం తిరిగింది. పైగా కంపెనీ సీఈవోపై కన్నేసిన ఆ ప్రబుద్ధుడికి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉండటం శోచనీయం. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మీకాంత్.. హైదరాబాద్ నగరంలో ఓ ఆన్‌లైన్ బిజినెస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబంతో చిక్కడపల్లిలో నివాసం ఉంటున్నాడు. లక్ష్మీకాంత్ వక్రబుద్ధితో తాను పనిచేసే కంపెనీ మహిళా సీఈవోపైనే కన్నేశాడు. ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో అతడి ఉద్యోగం ఊడింది. పని తీరు బాగా లేదనే కారణం చెప్పి అతడిని తొలగించారు.ఉద్యోగం ఊడిపోయినా లక్ష్మీకాంత్ బుద్ది మాత్రం మారలేదు. సీఈవోను ఎలాగైనా పొందాలనుకున్నాడు. ఆమె పర్సనల్ మెయిల్ ఐడీకి పదే పదే ప్రేమ సందేశాలు పంపించాడు. ఆమె తిరస్కరిస్తూ వస్తుండటంతో అతడు వేధింపుల పర్వం మొదలుపెట్టాడు. లొంగకపోవడంతో అసభ్యంగా ప్రవర్తించాడు. నకిలీ ఇ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని, దాని ద్వారా మహిళా సీఈవోకు అసభ్యకరంగా సందేశాలు పంపించడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా అశ్లీల చిత్రాలను కూడా పంపిస్తూ వేధించాడు.ఆగ్రహానికి గురైన బాధితురాలు వెంటనే హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఐపీ అడ్రెస్ ఆధారంగా లక్ష్మీకాంత్‌ను గుర్తించారు. పక్కా ఆధారాలతో అతడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.ఫేస్‌బుక్, వాట్సాప్, టిక్ టాక్ తదితర సోషల్ మీడియా ప్లాటఫాంలు వినియోగించే విషయంలో అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ముఖ్యంగా అనుమానిత సందేశాలు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలాంటి విషయంలో ఎలాంటి భయం అక్కర్లేదని, ధైర్యంగా పోలీసుల సాయంతో తీసుకోవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.

Related Posts