YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

నిర్భయ నిందితుల ఉరికి బ్రేక్

నిర్భయ నిందితుల ఉరికి బ్రేక్

నిర్భయ నిందితుల ఉరికి బ్రేక్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 
నిర్భయ దోషులను ఉరి తీసేందుకు మరోసారి డెత్‌ వారెంట్లు జారీ చేయాలన్న తీహార్‌ జైలు అధికారుల అభ్యర్థనను ఢిల్లీలోని పాటియాల హౌజ్‌ కోర్టు తిరస్కరించింది. దోషులు ముఖేష్‌ సింగ్, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌ న్యాయపరమైన అంశాలు పెండింగ్‌లో ఉన్నందుకు డెత్‌ వారెంట్లు జారీ చేయలేమని తెలిపింది. ప్రతిపాదనల ఆధారంగా డెత్‌ వారెంట్లు జారీచేయలేమని స్పష్టంచేసింది.కాగా, నిర్భయ దోషులు నలుగురూ న్యాయ పరమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే. దోషులను విడివిడిగా కాకుండా అందరికీ ఒకేసారి శిక్ష అమలుచేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. నిర్భయ దోషులకు విధించిన మరణశిక్ష అమలులో ఆలస్యాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఫిబ్రవరి 5న ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Related Posts