ఏడుగురు నిందితులు అరెస్ట్
చిత్తూరు ఫిబ్రవరి 8,
ఏడుగురు సభ్యులున్న అంతర్రాష్ట్ర చోరీ ముఠాను చిత్తూరు జిల్లా వి.కోట పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం పలమనేరు డీఎస్పీ ఆరీఫుల్లా మాట్లాడుతూ వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను వి.కోట పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. నిందితుల వద్ద నుండి నాలుగు బైక్ లను, ఒక మారుతీ 800 కారు, 126 గ్రాముల బంగారం, ఆర కిలో వెండితో పాటు లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు, చిత్తూరు, మదనపల్లి, పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలో 29 కేసులో వీరి ప్రమేయం ఉందని గుర్తించారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన మునియప్ప, గంగవరం మండలం కీలపల్లి గ్రామానికి చెందిన తలారి ప్రభు, తలారి బోయకొండ, రమేష్ బాబు, అంజప్ప, కుప్పంలోని ఎన్టీఆర్ కాలనీలో వుంటున్న రాజవేలు, కిరణ్ కుమార్ లను రిమాండుకు తరలించారని డీఎస్పీ వెల్లడించారు.