సీఎం జగన్కు జిత్తులమారి జీవీఎల్ ఏజెంట్..మాజీ మంత్రి బండారు
సీఎం జగన్కు జీవీఎల్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ ఇష్టమైతే ఆయన పార్టీలో చేరాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారవుపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. జీవీఎల్ నరసింహారావు ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కానీ.. ఆయన వల్ల ఒక్క రూపాయి లాభం లేదని విమర్శించారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. జీవీఎల్ ఈ రాష్ట్రంలో పుట్టినందుకు తాము సిగ్గుపడుతున్నాం అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జీవీఎల్ నపుంసకుడిలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రపజాలంతో సత్యనారాయణ విరుచుకుపడ్డారు.జీవీఎల్ లాంటి దుర్మార్గమైన ఎంపీని తానెప్పుడూ చూడలేదన్నారు.అమరావతిలో రైతుల ఆవేదన ఆయనకు కనిపించకపోవడం దారుణం అన్నారు.