జేసీ ట్రావెల్స్ పై వంద కోట్ల జరిమానా ?
అనంతపురం ఫిబ్రవరి 08
తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్ పై సుమారు 100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు అన్నారు. అంతేకాక జేసీ ట్రావెల్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరామన్నారు.అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ 2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్ 3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. దీని ప్రకారం 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్-4 వాహనాలు మాత్రమే విక్రయించాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. కానీ దీనికి విరుద్ధంగా అనంతపురం జిల్లాలో 68 నిషేధిత బీఎస్-3 వాహనాలు గుర్తించామని తెలిపారు. అయితే వీటిని స్క్రాబ్ కింద విక్రయించామని అశోక్ లేలాండ్ కంపెనీ తమకు వివరాలు పంపిందని వెల్లడించారు.నాగాలాండ్లో బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మార్చార్చి ఇందులో ఆరు వాహనాలు జేసీ దివాకర్ రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ జరిగాయని, ఒక వాహనం జేసీ ట్రావెల్స్ సంస్థ జటాధర ఇండస్ట్రీస్ పేరిట రిజిస్టరయ్యాయని చెప్పారు.మరో నాలుగు లారీలు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి జేసీ ఉమారెడ్డి పేరిట రిజిస్టరయ్యాయని అన్నారు.దీనిపై వన్టౌన్ పీఎస్లో జేసీపై ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న జేసీ ట్రావెల్స్పై విచారణ చేయాలని ఫిర్యాదుదారుడు చెప్పినట్లు వివరించినట్లు చెప్పారు.దీంతో జేసీ ట్రావెల్స్ కు ఉచ్చు మరింత బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది.