జగన్ తో ఎమ్మెల్యేల సెల్ఫీ
రాజమండ్రి, ఫిబ్రవరి 8
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా. మహిళల కోసం సీఎం అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. జగన్తో కలిసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు.మహిళలకు రక్షణగా నిలిచేందుకు దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దిశా యాక్ట్, దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లు తెచ్చిన సీయం వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను అన్నారు రోజా. చారిత్రాత్మక కార్యక్రమంలో జగనన్న, తోటి మహిళా నాయకులతో దిగిన ఫోటో అంటూ.. అక్కడ తీసుకున్న సెల్ఫీలను పోస్ట్ చేశారు.మహిళలకు రక్షణగా నిలిచేందుకు దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దిశా యాక్ట్, దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లు తెచ్చిన సీయం @ysjagan గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా.. అంటూ ట్వీట్ చేశారు. మహిళలకు రక్షణగా జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది. ఆడవాళ్ల భద్రతకు భరోసా ఇచ్చేందుకు దిశ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. తాజాగా దిశ పేరుతో పోలీస్ స్టేషన్లకు శ్రీకారం చుట్టింది. తొలి పీఎస్ను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది. అంతేకాదు మహిళల కోసం దిశ యాప్ను సిద్ధం చేశారు.. దీనిని సీఎం జగన్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, డీజీపీలు పాల్గొన్నారు.