YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

 సినీ ఇండస్ట్రీకి అమరావతి సెగ 

 సినీ ఇండస్ట్రీకి అమరావతి సెగ 

 సినీ ఇండస్ట్రీకి అమరావతి సెగ 
హైద్రాబాద్ ఫిబ్రవరి 8 
సినీ ఇండస్ట్రీకి అమరావతి సెగ తాకింది. అమరావతికి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ జేఏసీ నేతలు.. హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ముందు ధర్నాకు దిగారు. జేఏసీకి విద్యార్థులు కూడా సంఘీభావం తెలిపారు. సినిమావాళ్లు తమ ఆందోళనలకు మద్దతు తెలపాలంటూ.. ప్లకార్డులతో ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా పాల్గొన్నారు. ముందస్తు జాగ్రత్తగా అక్కడ పోలీసుల్ని మోహరించారు.అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. లేకపోతే తాము ఏపీలో సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్‌బాబుకు కూడా అమరావతి సెగ తగిలింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసం ఎదుట అమరావతి స్టూడెంట్స్ జేఏసీ ధర్నా చేసిన సంగతి తెలిసిందే.

Related Posts