YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

జేసీల వ్యాపారమంతా ఫోర్జరీలే

జేసీల వ్యాపారమంతా ఫోర్జరీలే

జేసీల వ్యాపారమంతా ఫోర్జరీలే
అనంతపురం ఫిబ్రవరి 8 
మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సోదరుల ట్రాన్స్‌పోర్టు వ్యాపారమంతా ఫోర్జరీ సర్టిఫికెట్లతోనే నడుస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. అనంతపురంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ దివాకర్‌ ట్రావెల్స్‌కు సంబంధించిన ఎన్‌వోసీ ధ్రువపత్రాలు, ఇతరత్రా పత్రాలన్నీ నకిలీవేనని చెప్పారు. అధికారుల సంతకాలతో మీ-సేవలో పొందినట్లుగా ఫోర్జరీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఆ పత్రాలకు సంబంధించిన నకళ్లు మీడియా ముందు ఆయన ప్రదర్శించారు.జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమాదేవి పేరున 84 బస్సులు ఉన్నాయని, వాటికి సంబంధించిన పత్రాలు కూడా నకిలీవేనని పెద్దారెడ్డి ఆరోపించారు. జేసీ సోదరులు అక్రమాలకు పాల్పడటమే కాకుండా, కుటుంబంలోని మహిళలను అడ్డుపెట్టుకొని అక్రమ వ్యాపారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ మోసాలకు సంబంధించి ఇప్పటికే పలుచోట్ల కేసులు నమోదయ్యాయన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమను ఎవరూ ఏమీ చేయలేరనే అక్రమాలకు పాల్పడ్డారని, వారి ఆగడాలకు తాను అడ్డుకట్ట వేస్తానని కేతిరెడ్డి హెచ్చరించారు. వారం రోజుల్లో మరోసారి మీడియా ఎదుటకు వచ్చి కీలకమైన సమాచారంతో జేసీ సోదరుల అక్రమాలను బయటపెడతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Related Posts